విశాఖలో మళ్లీ కలకలం.. రాంకీ ఫార్మాలో భారీ పేలుడు.. పెద్ద ఎత్తున మంటలు..
ABN , First Publish Date - 2020-07-14T05:07:01+05:30 IST
వైజాగ్: విశాఖపట్నం ఫార్మాసిటీలోని రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్లో భారీ పేలుడు సంభవించింది. ప్రస్తుతం పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
వైజాగ్: విశాఖపట్నం ఫార్మాసిటీలోని రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్లో భారీ పేలుడు సంభవించింది. ప్రస్తుతం పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఎగసిపడుతున్న ప్రదేశంలో ఇప్పటికి 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద స్థలానికి చాలా దూరంగా అగ్నిమాపక శకటాలు ఆగిపోయాయి. మంటల్ని అదుపు చేసేందుకు సమీపంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.