విశాఖ ఉక్కును ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలి

ABN , First Publish Date - 2021-03-05T06:20:40+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ బహుజన సమాజ్‌ పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుర్ల అప్పారావు గురువారం ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతికి వినతిపత్రం అందజేశారు.

విశాఖ ఉక్కును ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలి
ఆర్డీవోకు వినతిపత్రం అందిస్తున్న బీఎస్పీ నాయకులు.



పాడేరురూరల్‌, మార్చి 4: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ బహుజన సమాజ్‌ పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుర్ల అప్పారావు గురువారం ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సొంత గనులను కేటాయించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ కంపెనీతో పెట్టుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆర్డీవోను కలిసిన వారిలో బీఎస్పీ నాయకులు బి.మన్మధరావు, ఎం.పండన్న, ఎస్‌.దేముడ్లు. కె.సూరిబాబు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-05T06:20:40+05:30 IST