విశాఖపట్నం: 7న పాడేరులో మంత్రి పుష్పశ్రీవాణి పర్యటన
ABN , First Publish Date - 2020-07-06T12:52:19+05:30 IST
విశాఖపట్నం: 7న పాడేరులో మంత్రి పుష్పశ్రీవాణి పర్యటన
విశాఖపట్నం: రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఈనెల 7న పాడేరు వస్తున్నారని ఐటీడీఏ పీవో ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. తొలుత ఆమె ఏజెన్సీలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఐటీడీఏలో సమీక్షిస్తారు. అనంతరం అటవీ హక్కుల చట్టంలో భాగంగా, గిరిజనుల సాగుభూములకు హక్కులు కల్పించే వివరాలపై అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో మంత్రి సమావేశం నిర్వహిస్తారు.