‘స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ప్రకటనను ఖండిస్తున్నాం’

ABN , First Publish Date - 2021-03-09T02:36:53+05:30 IST

‘స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ప్రకటనను ఖండిస్తున్నాం’

‘స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ప్రకటనను ఖండిస్తున్నాం’

విజయవాడ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటనపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 100 శాతం షేర్లు అమ్ముతామన్న కేంద్ర ప్రకటనను ఖండిస్తున్నామన్నారు. కేంద్రమంత్రి ప్రకటన ప్రభుత్వ రంగ సంస్థల పట్ల బీజేపీ నిజస్వరూపమేంటో తెలిసిందని వ్యాఖ్యానించారు. బీజేపీపై ఇంకా రాష్ట్రంలో ఎవరికైనా భ్రమలు ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కలిసి రావాలన్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని మధు సూచించారు. 

Updated Date - 2021-03-09T02:36:53+05:30 IST