రాజకీయాలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం: అఖిలపక్షం
ABN , First Publish Date - 2021-02-19T17:25:34+05:30 IST
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో..
విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. రాజకీయపార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని అఖిలపక్షం నిర్ణయించింది. మోదీ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, వామపక్షాలతోపాటు పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్కు అఖిలపక్షాలు తర్వలోనే పిలుపు ఇవ్వనున్నాయి.