విశాఖ ఆర్కే బీచ్లో విషాదం..గల్లంతైన నలుగురిలో ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2022-01-02T22:52:36+05:30 IST
ఆర్కే బీచ్లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు....
విశాఖ: ఆర్కే బీచ్లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతులు సునీత త్రిపాఠి(ఒడిషా), శివ(హైదరాబాద్)గా గుర్తించారు. సునీత త్రిపాఠి.. పిక్నిక్ కోసం ఒడిషా నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.