ప్రాణం తీసిన ఆన్లైన్ జూదం
ABN , First Publish Date - 2020-07-12T22:09:17+05:30 IST
ప్రాణం తీసిన ఆన్లైన్ జూదం
విశాఖ: ఆన్లైన్ జూదం ప్రాణం తీసింది. దొడ్డి వెంకట అరవింద్ అనే వ్యక్తి గత మూడు రోజులుగా ఆన్లైన్లో జూదం ఆడుతూ రూ.6 లక్షలు పోగొట్టుకున్నాడు. ఒరిస్సా రాయగడలో ప్రైవేట్ మైనింగ్ కంపెనీలో జూనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. స్వస్థలం అనకాపల్లిలో కొత్తూరు గ్రామం. మూడు రోజుల క్రితమే ఒరిస్సా నుంచి అనకాపల్లి తన ఇంటికి వచ్చిన వెంకట అరవింద్ జూదంలో రూ.6 లక్షలు పోగొట్టుకున్న విషయాన్ని ఇంట్లో చెప్పలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తుస్తున్నారు. అనకాపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.