సాల్వెంట్స్ ప్రమాదంపై విజయసాయిరెడ్డి ఆరా
ABN , First Publish Date - 2020-07-16T15:49:03+05:30 IST
ఫార్మాసిటీలోని రాంకీకి చెందిన విశాఖ సాల్వెంట్స్ను..
పరవాడ(విశాఖపట్నం): ఫార్మాసిటీలోని రాంకీకి చెందిన విశాఖ సాల్వెంట్స్ను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం అనకాపల్లి ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్లతో కలిసి సందర్శించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఇదే కంపెనీలో జరిగిన పేలుడు ప్రమాదంలో జూనియర్ ఆపరేటర్ కాండ్రేగుల శ్రీనివాసరావు మృతి చెందగా, సీనియర్ కెమిస్ట్ చవ్వా మల్లేశ్వరరావు గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలను ఆయన కంపెనీ యాజమాన్యం, అధికారులను అడిగి తెలుసుకున్నారు.