భారతీయ విద్యార్థులకు భారీగా బ్రిటన్ వీసాలు..!

ABN , First Publish Date - 2020-08-28T18:19:19+05:30 IST

భారతీయ విద్యార్థులకు బ్రిటన్ ప్రభుత్వం భారీ మొత్తంలో వీసాలు జారీ చేస్తుందని తాజాగా వెల్లడైన గణంకాలు తెలియజేస్తున్నాయి.

భారతీయ విద్యార్థులకు భారీగా బ్రిటన్ వీసాలు..!

లండన్: భారతీయ విద్యార్థులకు బ్రిటన్ ప్రభుత్వం భారీ మొత్తంలో వీసాలు జారీ చేస్తుందని తాజాగా వెల్లడైన గణంకాలు తెలియజేస్తున్నాయి. ప్రతి యేటా ఇండియన్ స్టూడెంట్స్‌కు యూకే ఇస్తున్న వీసాలు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటున్నాయని గురువారం విడుదలైన అధికారిక గణంకాలు సూచిస్తున్నాయి. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్‌ఎస్) కనుగొన్న డేటా ప్రకారం యూకే హోమ్ ఆఫీస్ ఈ ఏడాది మార్చి చివరి నాటికి మంజూరు చేసిన మొత్తం 2,99,023 స్పాన్సర్డ్ స్టడీ వీసాల్లో 17 శాతం భారతీయ విద్యార్థులు(50,833)  ఉన్నారని తెలిసింది.


2019 నుండి రెట్టింపు కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు వీసాలు పొందుతున్నారని ఓఎన్‌ఎస్ లెక్కలు చెబుతున్నాయి. కాగా, 2019లో వీసాలు మంజూరు అయిన భారత పౌరుల సంఖ్య 49,844కు చేరింది. ఇలా 2016 నుండి నిరంతర పెరుగుదల ఉంది. ఇక మొత్తం స్టడీ వీసాలలో 40 శాతం ఉన్న చైనా తరువాత, దేశం వలస గణాంకాల పెరుగుదలను ప్రతిబింబించేలా బ్రిటన్ విదేశీ విద్యార్థుల రాకను భారతదేశం పెంచుతోందని ఓఎన్‌ఎస్ డేటా సూచిస్తోంది. 

Updated Date - 2020-08-28T18:19:19+05:30 IST