Visakha: సింహగిరిపై సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన స్వరూపానందేంద్ర

ABN , First Publish Date - 2022-01-14T14:22:57+05:30 IST

నగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.

Visakha: సింహగిరిపై సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన స్వరూపానందేంద్ర

విశాఖపట్నం: నగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సింహగిరిపై శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర భోగిమంట వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఆపై సింహాద్రి అప్పన్న స్వామిని స్వామీజీ దర్శించుకున్నారు. శారదా పీఠం ఇలవేల్పు అయినటువంటి భోగి పండుగ రోజు అప్పన్న సందర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా స్వామీజీ అన్నారు. సంక్రాంతి పండుగ రైతుల పండుగన్నారు. తొలి పంట చేతికి రాగానే కుటుంబ సమేతముగా భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి అని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-14T14:22:57+05:30 IST