Visakhaలో వామపక్షాల ర్యాలీ

ABN , First Publish Date - 2022-02-04T17:57:02+05:30 IST

పీఆర్సీ సాధన సమితి ఉద్యమ స్పూర్తిని కొనియాడుతూ విశాఖలో వామపక్షాలు ర్యాలీ చేపట్టాయి.

Visakhaలో వామపక్షాల ర్యాలీ

విశాఖపట్నం: పీఆర్సీ సాధన సమితి ఉద్యమ స్పూర్తిని కొనియాడుతూ విశాఖలో వామపక్షాలు ర్యాలీ చేపట్టాయి. జీవీఎమ్సీ గాంధీ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జరిగిన ర్యాలీలో సీపీఐ, సిపిఎం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలో విజయవాడ సంపూర్ణంగా విజయవంతం అయిందని... ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని అన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతోన్నఉద్యోగులను ప్రభుత్వం గౌరవించాలని తెలిపారు. ‘‘నేను వున్నాను నేను విన్నాను అని చెప్పే జగన్ ఉద్యోగులను ఎందుకు రోడ్డెక్కేలా చేశారు?’’ అని మండిపడ్డారు. ప్రజలకు, ఉద్యోగులకు మధ్య వివాదం తెచ్చే ఆలోచనలు మానుకోవాలన్నారు. ఈనెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతోన్న ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-04T17:57:02+05:30 IST