విశాఖ: జ్ఞానాపురంలో ఉద్రిక్తత.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-25T18:32:32+05:30 IST

విశాఖ: నగరంలోని జ్ఞానాపురంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు...

విశాఖ: జ్ఞానాపురంలో ఉద్రిక్తత.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

విశాఖ: నగరంలోని జ్ఞానాపురంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగారు. సెంట్ ఆన్స్, సెయింట్ జోసఫ్‌తోపాటు సమీపంలోని పలు ఎయిడెడ్ పాఠశాలలు మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.


ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తామని గతంలో జీవో జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నారు. అయితే ప్రభుత్వ సంస్థలు ఉండాలి.. లేదా ప్రైవేటు పరం చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సెంట్ ఆన్స్, సెయింట్ జోసఫ్‌తోపాటు సమీపంలోని పలు ఎయిడెడ్ పాఠశాలలు మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. పిల్లలను వేరే స్కూల్లో చేర్చుకోవాలని, సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేమని యాజమాన్యాలు  చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకు ఈ పాఠశాలలు, కళాశాలలే కావాలని, అమ్మఒడి అవసరం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-25T18:32:32+05:30 IST