పాడేరులో పోలీసులు, బీజేపీ యువమోర్చా మధ్య వాగ్వాదం
ABN , First Publish Date - 2021-09-11T17:49:26+05:30 IST
విశాఖ పాడేరులో పోలీసులు, బీజేపీ యువమోర్చా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
విశాఖపట్నం: విశాఖ పాడేరులో పోలీసులు, బీజేపీ యువమోర్చా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్వామి వివేకానంద చికాగోలోని సర్వమత సమావేశానికి 128 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాడేరులో యువ మోర్చ 2 కే రన్ నిర్వహించింది. కాగా 2కే రన్కు అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే 7న స్టేషన్లో అనుమతి కోసం ఇచ్చామన్న యువ మోర్చ నాయకులు చెబుతున్నారు. అరెస్టులకు భయపడమంటూ బీజేవైఎం శ్రేణులు 2 కే రన్ను పూర్తి చేశారు.