రానున్న రోజుల్లో Visakha మరింత అభివృద్ధి: Vidadala Rajani

ABN , First Publish Date - 2022-06-16T21:51:06+05:30 IST

రానున్న రోజుల్లో విశాఖ నగరం మరింత అభివృద్ధి జరుగుతోందని మంత్రి విడదల రజనీ అన్నారు.

రానున్న రోజుల్లో Visakha మరింత అభివృద్ధి: Vidadala Rajani

Visakha: రానున్న రోజుల్లో విశాఖ మరింత అభివృద్ధి జరుగుతుందని మంత్రి విడదల రజనీ (Vidadala Rajani) అన్నారు. గురువారం జిల్లా సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ అంటే సీఎం జగన్‌ (Jagan)కు ప్రత్యేకమైన అభిమానమని చెప్పారు. ఎక్కడా జరగని అభివృద్ధి పనులు విశాఖ జిల్లాలో జరుగుతున్నాయన్నారు. అభివృద్ధికి సంబంధించి సమావేశంలో చర్చలు జరిపినట్లు మంత్రి చెప్పారు.


అవంతి శ్రీనివాస్ (Avanti Srinivas) మాట్లాడుతూ ఎప్పటి నుంచే పెండింగ్‌లో ఉన్న సింహాచలం భూ సమస్య, హౌసింగ్, జీవీఎంసీలో బేసిక్ ఎమర్జెన్సీ, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర పనులకు సంబంధించి అధికారులకు మంత్రి విడదల రజనీ అదేశాలిచ్చారన్నారు. రాబోయే రోజుల్లో మార్పును ప్రజలు చూస్తారని, ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని అవంతి శ్రీనివాస్ అన్నారు.

Updated Date - 2022-06-16T21:51:06+05:30 IST