Visakha: జీవీఎంసీ రెండు వార్డుల్లో వైసీపీ విజయం

ABN , First Publish Date - 2021-11-17T18:28:06+05:30 IST

విశాఖ జీవీఎంసీ రెండు ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది.

Visakha: జీవీఎంసీ రెండు వార్డుల్లో వైసీపీ విజయం

విశాఖపట్నం: విశాఖ జీవీఎంసీ రెండు ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. 31 వార్డులో 59 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బిపిన్ జైన్ విజయం సాధించగా... 61వ వార్డులో 2028 ఓట్ల మెజార్టీతో జనసేన అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి కొణతాల సుధ గెలుపొందారు. 61వ వార్డులో వైసీపీ అభ్యర్థికి 4,952 ఓట్లు రాగా... జనసేన అభ్యర్థికి 2,924 ఓట్లు వచ్చాయి. 61వ వార్డులో టీడీపీ పోటీ చేయలేదనే విషయం తెలిసిందే. అలాగే 31వ వార్డులో వైసీపీ అభ్యర్థికి 3087 ఓట్లు రాగా... టీడీపీకి 3028 ఓట్లు, జనసేనకు 359 ఓట్లు వచ్చాయి. 

Updated Date - 2021-11-17T18:28:06+05:30 IST