విశాఖ: జీతాలు లేక అంగన్వాడీ సిబ్బంది తీవ్ర అవస్థలు
ABN , First Publish Date - 2022-05-01T16:45:39+05:30 IST
జీతాల్లేక అంగన్వాడీ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆచంట సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లోని సమస్యలపై టీడీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆధారాలతో సహా డీఆర్వోకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీతాల్లేక అంగన్వాడీ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. జీతాలు పెంచాలని అడిగితే బెదిరిస్తున్నారని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు వదులు కోవాలని వైసీపీ నేతలు వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో అంగన్వాడీ వర్కర్లు ముందుంటారన్నారు. కాలం చెల్లిన సరుకులు అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నారని, పిల్లలు అనారోగ్యం భారిన పడుతున్నా.. ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అసమర్థ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు తిష్టవేశాయన్నారు. టీడీపీ నిర్మించిన భవనాలు తప్ప కొత్తగా ఒక్కటీ నిర్మించలేదని ఆచంట సునీత విమర్శించారు.