గాజువాక తహసీల్దార్‌కు హైకోర్టు ఝలక్

ABN , First Publish Date - 2022-04-15T15:51:25+05:30 IST

గాజువాక తహసీల్దార్‌ ఎం.వి.లోకేశ్వరారావుకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది.

గాజువాక తహసీల్దార్‌కు హైకోర్టు ఝలక్

విశాఖపట్నం: గాజువాక తహసీల్దార్‌ ఎం.వి.లోకేశ్వరారావుకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. కోర్టు ధిక్కారం కేసులో తహసీల్దార్‌కు 6 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.2 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ నెల 18న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 10 నెలల క్రితం తుంగ్లాంలో ఓ ప్రైవేటు స్థలం ప్రహరీ గోడను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. టీడీపీ నేత 'పల్లా' ఆక్రమణలో ఉన్న భూమిగా భావిస్తూ దుందుడుకు చర్య పాల్పడ్డారు. యజమానులు హక్కు పత్రాలు చూపించినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా తీర్పును వెల్లడించింది. 

Updated Date - 2022-04-15T15:51:25+05:30 IST