మేం ఏం చేసినా మా ఎమ్మెల్యే చూసుకుంటాడు... రెచ్చిపోయిన వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2022-02-20T15:56:25+05:30 IST

నగరంలోని వైసీపీ నేతలు బరితెగిస్తూ ప్రవర్తించారు. మాకవరపాలెం దాబాలో మద్యం తాగి వీరంగం సృష్టించారు.

మేం ఏం చేసినా మా ఎమ్మెల్యే చూసుకుంటాడు... రెచ్చిపోయిన వైసీపీ నేతలు

విశాఖపట్నం: నగరంలోని వైసీపీ నేతలు బరితెగిస్తూ ప్రవర్తించారు. మాకవరపాలెం దాబాలో మద్యం తాగి వీరంగం సృష్టించారు.  గొలుగొండ మండలం పాకలపాడు ఎంపీటీసీ భర్త సన్యాసినాయుడు, పాకలపాడు స్కూల్ కమిటీ చైర్మన్ నానాజీ వారి స్నేహితులు  మద్యం తాగి హల్‌చల్ చేశారు. దీంతో దాబా చుట్టుపక్కల నిర్వాసితులు డయల్ 100కు  ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే వైసీపీ నేతలు... పోలీసులను సైతం లెక్కచెయకుండా దురుసుగా ప్రవర్తించారు. ‘‘నీకు సమాధానం చెప్పడానికి ఎమ్మెల్యే రావాలా? మేము ఎం చేసినా మా ఎమ్మెల్యే చేసుకుంటాడు’’ అంటూ పోలీసులపై వైసీపీ నేతలు రెచ్చిపోయారు. దాబాలోని వైసీపీ నేతల హల్‌చల్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

Updated Date - 2022-02-20T15:56:25+05:30 IST