Visakha: వైసీపీ కార్పొరేటర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు
ABN , First Publish Date - 2022-02-10T15:25:11+05:30 IST
నగరంలోని గాజువాక 66వ వార్డు వైసీపీ కార్పోరేటర్ మహ్మద్ ఇమ్రాన్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.
విశాఖపట్నం: నగరంలోని గాజువాక 66వ వార్డు వైసీపీ కార్పోరేటర్ మహ్మద్ ఇమ్రాన్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఒక కేసు సెటిల్మెంట్లో దళిత యువకుడిని చితకబాది కులం పేరుతో దూషించినట్టు గాజువాక పోలీసులకు సదరు యువకుడు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నేపథ్యంలో 66వ వార్డు వైసీపీ కార్పోరేటర్ ఇమ్రాన్తో పాటు అతని అనుచరులపై 235/2022 ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. 324, 348, 506 ఆర్/డబ్ల్యూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.