Visakha: విద్యుత్ షాక్తో హోంగార్డు మృతి
ABN , First Publish Date - 2022-02-04T14:14:23+05:30 IST
నగరంలో విద్యుత్ షాక్తో హోంగార్డ్ ఈశ్వరరావు మృతి చెందడం కలకలం రేపుతోంది. సీలేరు ఏపీజెన్కో గృహంలో ఈ ఘటన జరిగింది.
విశాఖపట్నం: నగరంలో విద్యుత్ షాక్తో హోంగార్డ్ ఈశ్వరరావు మృతి చెందడం కలకలం రేపుతోంది. సీలేరు ఏపీజెన్కో గృహంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం హోంగార్డ్ ఈశ్వర రావు వాటర్ హీటర్ పెడుతుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈశ్వరరావు పోలీసుశాఖలో హోంగార్డ్గా ఉంటూ ఏపీజెన్కోకు డిప్యూటేషన్పై వచ్చారు. ఈ క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే జెన్కో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.