Visakhaలో రోడ్డు ప్రమాదం...తల్లీకూతురు మృతి
ABN , First Publish Date - 2021-11-15T13:38:54+05:30 IST
నగరంలోని ఆరిలోవ హెల్త్ సిటీ క్యూఒన్ ఆసుపత్రి సమీపంలో సోమవరాం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి చెందారు.
విశాఖపట్నం: నగరంలోని ఆరిలోవ హెల్త్ సిటీ క్యూఒన్ ఆసుపత్రి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లీ కూతుర్లను ఎదురుగా వస్తున్న చిన్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కుమార్తె కె.మౌనిక(22) అక్కడికక్కడే మృతి చెందగా...తల్లి సత్యవేణి(45)ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సత్యవేణి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మృతురాలు మౌనిక ఇటీవల ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మృతులు సుజాత నగర్ పాపయ్యరాజు పాలెం నివాసులుగా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.