మద్విలపాలెంలో ఐద్వా కమిటీ నిరసన.. అడ్డుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2022-06-20T17:37:47+05:30 IST
అగ్నిపథ్ స్కీమ్ రద్దు చేయాలని ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో మద్దిలపాలెంలో నిరసనకు దిగారు.
విశాఖపట్నం: అగ్నిపథ్ స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో మద్దిలపాలెంలో నిరసనకు దిగారు. మద్దిలపాలెం సీఐటీయూ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో డీవైఎఫ్ఐ, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. యువత భవిష్యత్తుతో ఆటలడొద్దంటూ... కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ కార్యాలయం సమీపంలోనే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.