Visakhapatnam: దళిత యువకుడిని చెప్పుతో కొట్టించిన పెద్దలు

ABN , First Publish Date - 2022-06-09T14:06:05+05:30 IST

నగరంలోని పెందుర్తి మండలం జుత్తాడలో దారుణం జరిగింది. దళిత యువకుడిని చెట్టుకు కట్టేసి దాడి చేసిన వైనం ఆశ్చర్యానికి గురిచేసింది

Visakhapatnam: దళిత యువకుడిని చెప్పుతో కొట్టించిన పెద్దలు

విశాఖపట్నం: నగరంలోని పెందుర్తి మండలం జుత్తాడలో దారుణం జరిగింది. దళిత యువకుడిని చెట్టుకు కట్టేసి దాడి చేసిన వైనం ఆశ్చర్యానికి గురిచేసింది. ఊరి పెద్దలు బాధితుడిని మరో దళిత వ్యక్తితో చెప్పుతో కొట్టించారు. వైసీపీ ఎంపీటీసీ బీఎన్ రాజును దుర్భాషలాడినందుకు దాడికి పాల్పడ్డారు. కాగా... దాడి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవడంతో...సెల్ఫోన్ చోరీ పేరుతో యువకుడిపై పోలీస్‌స్టేషన్‌లో పెద్దలు కేసు పెట్టించడం పట్ల ర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-06-09T14:06:05+05:30 IST