Visakhapatnamలో యువకుడి దారుణ హత్య
ABN , First Publish Date - 2022-05-27T16:00:32+05:30 IST
జిల్లాలోని మర్రిపాలెం రైల్వే క్వాటర్స్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
విశాఖపట్నం: జిల్లాలోని మర్రిపాలెం రైల్వే క్వాటర్స్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రెబాక సాయి తేజ(25) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులు, రాడ్లతో దాడి చేశారు. యువకుడిపై దాడి చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. మద్యం మత్తులో ఘర్షణ పడి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.