సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో పడి భక్తుడు మృతి

ABN , First Publish Date - 2022-04-16T18:54:08+05:30 IST

సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి గోర్లే మోహన్ రావు(19) అనే భక్తుడు మృతి చెందాడు.

సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో పడి భక్తుడు మృతి

విశాఖపట్నం: సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి గొర్లె మోహన్ రావు(19) అనే భక్తుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్ల పల్లి గ్రామానికి చెందిన మోహన్ రావు అనే భక్తుడు ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి  సింహాచలం దేవస్థానానికి వచ్చాడు. ఈ క్రమంలో పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 2 నెలల కిందట ఓ భక్తుడు పుష్కరిణిలో స్నానాలు చేయడానికి పూడికలు తీయాలని విజ్ఞప్తి చేసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించారు. బురద నీటిలో భక్తులు స్నానాలు చేస్తుంటే కనీస భద్రతా ప్రమాణాలు తీసుకోలేదని భక్తులు మండిపడుతున్నారు. అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న గోపాలపట్నం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

Updated Date - 2022-04-16T18:54:08+05:30 IST