Visakha: మేఘాద్రిగడ్డను సందర్శించిన బీజేపీ నేతలు
ABN , First Publish Date - 2022-04-09T16:33:19+05:30 IST
నగరంలోని మేఘాద్రిగడ్డను బీజేపీ నేతలు శనివారం ఉదయం సందర్శించారు.
విశాఖపట్నం: నగరంలోని మేఘాద్రిగడ్డను బీజేపీ నేతలు శనివారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మాట్లాడుతూ... ఉత్తరాంధ్రలో అనేక ప్రాజెక్టులున్నాయన్నారు. నూరేళ్లనాటి తోటపల్లి ప్రాజెక్టులకు నిర్వహణ వ్యయం కూడా ఇవ్వకపోవడంతో గేట్లు పని చేయటం లేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర నుంచి తరతరాలుగా లక్షలాది మంది పొట్టకూటి కోసం వలస పోతున్నారని సోమువీర్రాజు అన్నారు.