విశాఖలో 680 కేజీల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2022-04-04T17:01:27+05:30 IST

విశాఖ అరకులోయ మండలం పద్మాపురం జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా లారీలో తరలిస్తున్న 680 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖలో 680 కేజీల గంజాయి స్వాధీనం

విశాఖపట్నం: విశాఖ అరకులోయ మండలం పద్మాపురం జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా లారీలో తరలిస్తున్న 680 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిషాలోని పాడువా నుంచి జార్ఖండ్‌కు లారీలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులలో ఒకరు పరారయ్యారు. ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ముగ్గురిలో ఒకరు ఒడిషా గొల్లూరి గ్రామ సర్పంచ్‌గా గుర్తించారు. ఈ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా.

Updated Date - 2022-04-04T17:01:27+05:30 IST