విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమం ఉధృతం
ABN , First Publish Date - 2021-02-26T13:30:20+05:30 IST
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది.
విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు రాస్తారోకోకు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రహదారుల దిగ్బంధం చేయనున్నారు. రాస్తారోకోకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.