విశాఖలో మహిళా సంఘాల నిరసన
ABN , First Publish Date - 2020-10-01T18:10:22+05:30 IST
విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాలు నిరసనకు దిగాయి.
విశాఖపట్నం: విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాలు నిరసనకు దిగాయి. ఉత్తర్ప్రదేశ్లో దళిత యువతిపై అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. దుర్ఘటనకు భాధ్యత వహిస్తూ యూపీ సీఎం రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దారుణానికి పాల్పడ్డ వారిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.