విశాఖపట్నంలో శాంతి యజ్ఞం ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-30T18:22:35+05:30 IST

దేవాలయాలపై దాడుల అరిష్టనివృత్తి కోసం శాంతి యజ్ఞం ప్రారంభంమైంది. ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు

విశాఖపట్నంలో శాంతి యజ్ఞం ప్రారంభం

విశాఖపట్నం: దేవాలయాలపై దాడుల అరిష్టనివృత్తి కోసం శాంతి యజ్ఞం ప్రారంభంమైంది. ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో ఆర్.ఆర్‌.వెంకటాపురం ముగ్గురు అమ్మవార్ల ఆలయం ప్రాంగణంలో శాంతి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. వేద పండితులు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల్లో వరుస అపచారాలు జరుగుతున్నాయని... అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి పశ్చాతాపం  కనిపించడంలేదని విమర్శించారు. ప్రభుత్వంతరపున ఇప్పటి వరకూ సంప్రోక్షణ చేయలేదన్నారు. అందుకేసాధుపరిషత్ ఆ బాధ్యత తీసుకుని  శాంతియజ్ఞం నిర్వహిస్తోందని తెలిపారు. దేవతలను శాంతిపజేసి అనర్ధాలు తలెత్తకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. పాలనాభాధ్యతలు వ్యవహించే వారిలో మార్పురావాలని అన్నారు. హిందూ దేవాలయ పరిరక్షణ అందరూ కృషి చేయాలని శ్రీనివాసానంద సరస్వతి పిలుపునిచ్చారు. 


Updated Date - 2020-09-30T18:22:35+05:30 IST