విశాఖలో దొంగల బీభత్సం

ABN , First Publish Date - 2020-09-24T16:28:04+05:30 IST

విశాఖలో దొంగలు బీభత్సం సృష్టించారు. దేవరాపల్లిలో ఇద్దరు యువతులను బెదిరించిన దుండగులు వారి వద్ద నుంచి రూ.4వేలు అపహరించి ఆటో నుంచి తోసేశారు.

విశాఖలో దొంగల బీభత్సం

విశాఖపట్నం: విశాఖలో దొంగలు బీభత్సం సృష్టించారు. దేవరాపల్లిలో ఇద్దరు యువతులను బెదిరించిన దుండగులు వారి వద్ద నుంచి రూ.4వేలు అపహరించి ఆటో నుంచి తోసేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన రక్షక్ పోలీసులు.. ఆటోను వెంబడించి పట్టుకున్నారు. ఇద్దరు యువతుల్ని బెదిరించి డబ్బులు దోచుకోవడమే కాకుండా, ఆటోను కూడా దొంగిలించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆటోలో ముగ్గులు దుండగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-09-24T16:28:04+05:30 IST