విశాఖ జిల్లా పెదబయలు మండలం దారుణం
ABN , First Publish Date - 2020-07-11T22:16:58+05:30 IST
విశాఖపట్నం : జిల్లాలోని పెదబయలు మండలం సిరసపల్లిలో దారుణం చోటుచేసుకుంది.
విశాఖపట్నం : జిల్లాలోని పెదబయలు మండలం సిరసపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని గలగండ పంచాయితీ సిరసపల్లిలో బాలుడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గత ఆదివారం రోహిత్ పశువులు మేపడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రోహిత్తో పాటు మరో ఐదుగురు అడవిలోకి వెళ్లారు. అయితే అడవి నుంచి తిరిగి వస్తుండగా రోహిత్ సెల్ కనిపించకపోవడంతో వెనక్కి వెళ్లి.. తర్వాత శవమై తేలాడు. శనివారం ఉదయం కుల్లిపోయిన స్థితిలో రోహిత్ చెట్టుకు వేలాడుతూ మృతదేహం కనిపించింది. రోహిత్ను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో సిరసపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. వారం నుంచి రోహిత్ కోసం తల్లిదండ్రులు వెతుకుతున్నారు. ఆ బాలుడు పెద్దబయలులో 7వ తరగతి చదువుతున్నాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.