Visakhaలో జనసేన కార్పొరేటర్ వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-08-17T18:53:15+05:30 IST
జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ వినూత్నరీతిలో నిరసన చేపట్టారు.
విశాఖపట్నం: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. కమిషనర్ వాహనానికి అడ్డుగా పడుకొని నిరసన తెలియజేశారు. 22వ వార్డు పరిధిలో సచివాలయ సిబ్బందితో కార్పొరేటర్ హోదాలో మూర్తి యాదవ్ ఇటీవల సమావేశం నిర్వహించారు. కాగాసమావేశానికి హాజరైన వార్డు సచివాలయ కార్యదర్శులకు జీవీఎంసీ అధికారులు మెమోలు జారీ చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పోర్టికో వద్ద కమిషనర్ వాహనానికి అడ్డుగా పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు.