పీఆర్ మోహన్ మృతిపట్ల మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే దిగ్భ్రాంతి
ABN , First Publish Date - 2021-07-12T17:09:34+05:30 IST
మాజీ శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ మృతిపట్ల భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: మాజీ శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ మృతిపట్ల భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రీడాకారుడిగా, అడ్మినిస్ట్రేటర్గా మోహన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో పలు సేవలు అందించారని అన్నారు. శాప్ చైర్మన్గా క్రీడల అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పీఆర్మోహన్ కుటుంబానికి ఎమ్మెస్కే ప్రసాద్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.