నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం
ABN , First Publish Date - 2021-05-14T12:26:37+05:30 IST
సింహాద్రి అప్పన్నగా కీర్తించబడే లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం నేడు జరుగనుంది.
విశాఖపట్నం: సింహాద్రి అప్పన్నగా కీర్తించబడే లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం నేడు జరుగనుంది. కాగా కరోనా నేపథ్యంలో పరిమిత వైదిక సిబ్బందితో ఉత్సవ నిర్వహణ చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దీంతో వరుసగా రెండో ఏడాది స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభించని పరిస్థితి నెలకొంది. అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకు, ధర్మ కర్తల మండలి చైర్ పర్సన్ సంచయితకు తొలి దర్శనం కల్పించనున్నారు. స్వామి వారికి ప్రభుత్వం తరుపున మంత్రి అవంతి శ్రీనివాసరావు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ప్రజా ప్రతినిధులు, పాలక మండలి సభ్యులు, అధికారులకు కూడా దర్శనానికి అనుమతి నిరాకరించారు.