విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు
ABN , First Publish Date - 2022-06-27T06:07:44+05:30 IST
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ఈ పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపా లని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డి మాండ్ చేశారు.
రణస్థలం:విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ఈ పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపా లని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డి మాండ్ చేశారు. విశా ఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపుమేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం రామతీర్థం జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశా ఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం నేటికి 500 రోజులు పూర్తి చేసుకుందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 68 గ్రామాల్లో 17 వేల కుటుంబాలు 22 వేల ఎకరాల భూమి ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల ఆస్తిని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని కేంద్రాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె.గురునాయు డు, వెలమల రమణ, వై.సత్యనారాయణ, ఎస్.రాజాబాబు పాల్గొన్నారు.