స్టీల్ ప్లాంట్ కోసం 134 రోజులుగా దీక్షలు: అయోధ్యరామ్

ABN , First Publish Date - 2021-06-25T16:59:47+05:30 IST

విశాఖ: స్టీల్ ప్లాంట్ కోసం 134 రోజులుగా దీక్షలు చేస్తున్నామని అయోధ్యరామ్ అన్నారు.

స్టీల్ ప్లాంట్ కోసం 134 రోజులుగా దీక్షలు: అయోధ్యరామ్

విశాఖ: స్టీల్ ప్లాంట్ కోసం 134 రోజులుగా దీక్షలు చేస్తున్నామని ఉక్కు పరిరక్షణ పోరాటకమిటి కన్వీనర్ అయోధ్యరామ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 27న స్టీల్ ప్లాంట్‌ను  స్ట్రాటజిక్ సేల్ పేరుతో నిర్ణయం చేశారన్నారు. 22 న ఢిల్లీలో దీపం వారు 45 మందితో రహస్యంగా సమావేశమై ఎలా అమ్మాలి అనేదానిపై చర్చించారని.. ఆ సమావేశం వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో కూడ ప్రైవేటుపరం చేయొద్దంటూ తీర్మానం చేశారన్నారు. ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా చాలా మంది నేతలు వ్యతిరేకించారన్నారు. ఫ్యాక్టరీ నష్టాల్లో లేదని, స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ పరిశ్రమగానే కొనసాగాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని అయోధ్యరామ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-06-25T16:59:47+05:30 IST