విశాఖ స్ట్రీల్ను అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు: మేధాపాట్కర్
ABN , First Publish Date - 2021-10-30T16:15:17+05:30 IST
విశాఖ స్ట్రీల్ ప్లాంటు ప్రవేటీకరణ వ్యతిరేకంగా కూర్శన్నపాలెం దగ్గర కార్మికులు దీక్ష చేపట్టారు.
విశాఖ: విశాఖ స్ట్రీల్ను అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్ అన్నారు. స్ట్రీల్ ప్లాంటు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కూర్శన్నపాలెం దగ్గర కార్మికులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్, ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ శనివారం సంఘీభావం పలికారు. ఈ సందర్భంగా మేధాపాట్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థల ప్రై వేటీకరణతో దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశాన్ని ప్రజలే నిర్మించుకున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజలు, కార్మికులు, రైతులు ఉద్యమం చేసే సమయం ఆసన్నమైందని మేధాపాట్కర్ తెలిపారు.