విశాఖ దివ్య హత్య కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

ABN , First Publish Date - 2020-06-06T22:33:14+05:30 IST

దివ్య హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2015లో దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మ హత్యకు గురయ్యారు. ఇంకా ఆ మూడు హత్యల కేసు మిస్టరీ వీడలేదు.

విశాఖ దివ్య హత్య కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

విశాఖ: దివ్య హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2015లో దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మ హత్యకు గురయ్యారు. ఇంకా ఆ మూడు హత్యల కేసు మిస్టరీ వీడలేదు. దివ్యతో పాటు కుటుంబసభ్యుల హత్యలపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. రావులపాలెం నుంచి దివ్య పిన్నిని పోలీసులు  విశాఖకు తీసుకొచ్చారు. దివ్య పిన్నిని పోలీసులు విచారిస్తున్నారు. 


దివ్య అందాన్ని అడ్డుపెట్టుకుని ఆమెతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించాలని వివాహిత వసంత, ఆమె సోదరి ప్లాన్ వేసుకున్నారు. దివ్యను పెట్టుబడిగా పెట్టి వసంత గ్యాంగ్ డబ్బులు సంపాదిస్తోంది. ఇలా జరుగుతున్న క్రమంలో డబ్బులు పంపకం విషయంలో దివ్య, వసంత గ్యాంగ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో దివ్యను అంతమొందించాలని వసంత గ్యాంగ్ స్కెచ్ వేసింది. అంతే తడువుగా కుట్ర ప్లాన్‌ను అమలు చేశారు. దివ్యకు గుండు గీసి, కనుబొమ్మలు కత్తిరించి, వాతలు పెట్టి ప్రాణాలు తీశారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. రెండో రోజుల్లోనే మిస్టరీని ఛేదించారు. దివ్య స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాగా గుర్తించారు.

Updated Date - 2020-06-06T22:33:14+05:30 IST