జగన్ ప్రభుత్వం, పోలీసుల వైఖరిని ఖండించాలి: మావో నేత అరుణ
ABN , First Publish Date - 2020-08-15T15:09:30+05:30 IST
కరోనా విజృంభిస్తున్న సమయంలో డబ్బులిచ్చి కిరాయి మనుషులతో ఊరేగింపులు చేయించిన జగన్ ప్రభుత్వం, పోలీసుల
విశాఖపట్నం: కరోనా విజృంభిస్తున్న సమయంలో డబ్బులిచ్చి కిరాయి మనుషులతో ఊరేగింపులు చేయించిన జగన్ ప్రభుత్వం, పోలీసుల వైఖరిని ఖండించాలని మావో నేత అరుణ పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్ట్ విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదలైంది. చరిత్రను విస్మరించిన విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు అవాకులు, చవాకులు మాట్లాడి తన అవివేకాన్ని తానే చతుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రమాదవశాత్తు మందుపాతర పేలి చనిపోయిన మోహనరావు, అజయ్ కుమార్ల కుటుంబాలకు తమ పార్టీ, విప్లవ ప్రజలు అండగా ఉంటారని అరుణ లేఖలో స్పష్టం చేశారు.