విరుష్క విరాళం ఎంత..?
ABN , First Publish Date - 2020-03-31T10:20:57+05:30 IST
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళనలు రేకెత్తిస్తుండగా అటు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రముఖుల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి...
ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళనలు రేకెత్తిస్తుండగా అటు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రముఖుల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అతడి భార్య అనుష్క శర్మ కూడా తమవంతు విరాళాన్ని ప్రకటించారు. అయితే బహిరంగంగా ఈ మొత్తాన్ని వెల్లడించకపోయినా ఇద్దరూ కలిసి ప్రధాని అత్యవసర నిధి, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.3 కోట్లను అందించినట్టు సమాచారం. ‘పీఎం కేర్స్ ఫండ్ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ (మహారాష్ట్ర)కు నేను, అనుష్క మద్దతు ఇస్తున్నాం. బాధితులను చూసి మా హృదయాలు బద్దలవుతున్నాయి. మా వితరణ తోటి ప్రజానీకానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు.