పోలింగ్ సిబ్బందికి వర్చువల్ శిక్షణ
ABN , First Publish Date - 2020-10-02T07:59:08+05:30 IST
కొవిడ్-19 నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల
ఈసీ
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కొవిడ్-19 నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారఽథి ఆదేశించారు.
అభ్యర్థులు ఆన్లైన్లోనే నామినేషన్లు, అఫిడవిట్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని, పైలట్ పద్దతిన ఈ- ఓటింగ్ ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఆయన సూచించారు. పోలింగ్ సిబ్బందికి వర్చువల్ శిక్షణ ఇవ్వాలని నిర్దేశించారు.