వర్చువల్ ర్యాలీని జయప్రదం చేయడి
ABN , First Publish Date - 2020-07-01T11:38:04+05:30 IST
రాష్ట్రంలో బీజేపీ వర్చువల్ ర్యాలీ (జన్ సంవాద్)ని విజయవంతం చేయాలని ఆ పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు.
బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురావు రావు పద్మ
మట్టెవాడ, జూన్ 30: రాష్ట్రంలో బీజేపీ వర్చువల్ ర్యాలీ (జన్ సంవాద్)ని విజయవంతం చేయాలని ఆ పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. బీజేపీ అర్బన్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బుధవారం జన్సంవాద్ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పాలొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగాని జగదీశ్వర్, వర్చువల్ ర్యాలీ జిల్లా కన్వీనర్ కందకట్ల సత్యనారాయణ పాల్గొన్నారు.