ఆంఫన్ బాధితులకు కోహ్లీ, రాహుల్ నివాళి

ABN , First Publish Date - 2020-05-21T21:33:23+05:30 IST

బెంగాల్ తీరాన్ని తాకిన అంఫాన్ తుఫాన్.. ఆ రాష్ట్రంలో బీభ‌త్సం సృష్టిస్తున్న‌ది. తుఫాన్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు పలువురు ప్రాణాలు కోల్పోయారు.. బ‌ల‌మైన

ఆంఫన్ బాధితులకు కోహ్లీ, రాహుల్ నివాళి

కోల్‌కతా: బెంగాల్ తీరాన్ని తాకిన ఆంఫన్ తుఫాన్.. ఆ రాష్ట్రంలో బీభ‌త్సం సృష్టిస్తున్న‌ది.  తుఫాన్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు పలువురు ప్రాణాలు కోల్పోయారు.. బ‌ల‌మైన ఈదురుగాలులు, వ‌ర్షాల‌కు.. వేలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయి. అయితే ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ నివాళులు అర్పించారు. 


‘‘పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఆంఫన్ తుఫాను బాధితుల గురించి నేను ప్రార్థిస్తున్నాను. దేవుడి అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరిని కాపాడాలని.. మళ్లీ పరిస్థితి మామూలుగా మారాలని కోరుకుంటున్నాను’’ అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. ‘‘ఆంఫన్ తుఫాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశాడు. 

Updated Date - 2020-05-21T21:33:23+05:30 IST