విజ్డెన్‌ దశాబ్దపు క్రికెటర్‌ విరాట్‌

ABN , First Publish Date - 2021-04-16T06:05:56+05:30 IST

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన పురస్కారానికి ఎంపికయ్యాడు. మొట్టమొదటి వన్డే క్రికెట్‌ మ్యాచ్‌ (1971) జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1971-2021 మధ్య ఒక్కో దశాబ్దానికి సంబంధించి...

విజ్డెన్‌ దశాబ్దపు క్రికెటర్‌ విరాట్‌

లండన్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన పురస్కారానికి ఎంపికయ్యాడు. మొట్టమొదటి వన్డే క్రికెట్‌ మ్యాచ్‌ (1971) జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1971-2021 మధ్య ఒక్కో దశాబ్దానికి సంబంధించి ఐదుగురు ఉత్తమ క్రికెటర్లను విజ్డెన్‌ ఎంపిక చేసింది. దీంట్లో విరాట్‌ 2010వ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్‌గా నిలిచాడు. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లీ 254 మ్యాచ్‌ల్లో 12,169 పరుగులు సాధించాడు. మిగతావారిలో 1970వ దశకంలో వివ్‌ రిచర్డ్స్‌, 1980ల్లో కపిల్‌ దేవ్‌, 1990ల్లో సచిన్‌, 2000వ దశకంలో మురళీధరన్‌ ఉత్తమ క్రికెటర్లుగా నిలిచారు. ఇక పురుషుల్లో బెన్‌ స్టోక్స్‌, మహిళల్లో బెత్‌ మూనీ విజ్డెన్‌ లీడింగ్‌ క్రికెటర్స్‌ ఇన్‌ ద వరల్డ్‌ గా ఎంపికయ్యారు. అలాగే సిబ్లే, జాక్‌ క్రాలే, జేసన్‌ హోల్డర్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, డారెన్‌ స్టీవెన్స్‌ విజ్డెన్‌ క్రికెటర్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎంపిక కాగా, కీరన్‌ పొలార్డ్‌ లీడింగ్‌ టీ20 క్రికెటర్‌ ఇన్‌ ద వరల్డ్‌గా నిలిచాడు.

Updated Date - 2021-04-16T06:05:56+05:30 IST