ధోనీ నమ్మకంతోనే కెప్టెన్‌ అయ్యా..!

ABN , First Publish Date - 2020-05-31T08:57:18+05:30 IST

మహేంద్ర సింగ్‌ ధోనీ వారసుడిగా జట్టు పగ్గాలు చేపట్టిన విరాట్‌ కోహ్లీ ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. అద్భుత ఆటతీరుతో పాటు కెప్టెన్‌గానూ ...

ధోనీ నమ్మకంతోనే కెప్టెన్‌ అయ్యా..!

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్‌ ధోనీ వారసుడిగా జట్టు పగ్గాలు చేపట్టిన విరాట్‌ కోహ్లీ ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. అద్భుత ఆటతీరుతో పాటు కెప్టెన్‌గానూ టీమిండియాను ఉన్నత స్థానంలో నిలిపాడు. ఇందుకు కారణంగా తాను ఎక్కువకాలం ధోనీ సహచర్యంలో గడపడమేనని స్పిన్నర్‌ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో కోహ్లీ తెలిపాడు. ‘ధోనీ రాజీనామా చేసిన వెంటనే సెలెక్టర్లు వచ్చి నన్ను కెప్టెన్‌గా ఉండమని చెప్పలేదు. అంతకంటే ముందు చాలా జరిగింది. మ్యాచ్‌ల సమయంలో ధోనీ నన్ను బాగా పరిశీలించేవాడు. అతడి తర్వాత జట్టును ముందుకు తీసుకెళ్లే ప్రతిభ ఉందని నాపై నమ్మకముంచాడు. స్లిప్‌లో అతడి పక్కనే ఫీల్డింగ్‌ చేసేవాడిని. ఈ క్రమంలో రెగ్యులర్‌గా ధోనీతో మాట్లాడే అవకాశం దక్కేది. నా అభిప్రాయాలతో చాలా వరకు విభేదించేవాడు కానీ విభిన్న విషయాలను చర్చించేవాడు. ఇదంతా చూశాకే అతనికి నాపై నమ్మకం కుదిరి కెప్టెన్‌గా రాణిస్తాడని భావించాడు’ అని కోహ్లీ వివరించాడు.

Updated Date - 2020-05-31T08:57:18+05:30 IST