అన్నప్రసాద వితరణకు దీపక్ నెక్స్జెన్ విరాళం
ABN , First Publish Date - 2021-04-17T05:33:48+05:30 IST
అన్నప్రసాద వితరణకు దీపక్ నెక్స్జెన్ విరాళం
హనుమాన్మాన్జంక్షన్ రూరల్, ఏప్రిల్ 16 : ద్వారకా తిరుమల దేవస్ధానం ఆధ్వర్యంలో భక్తులకు జరుగుతున్న నిత్య న్నదాన పథకానికి బొమ్ములూరులోని దీపక్ నెక్స్జెన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ. 18 లక్షలు విరాళాన్ని అందజేశారు. దేవస్థానం చైర్మన్ ఎస్.వి.సుధాకరరావుకు విరాళం చెక్కును శుక్రవారం కంపెనీ ఎండీ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, డైరెక్టర్ చైతన్యవాసులు అంద జేశారు. దేవస్ధానం అధికారుల ఆధ్వర్యంలో దీపక్ నెక్స్జెన్ చైర్మన్ సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లకు స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు అన్నప్రసాద వితరణకు తమ వంతు సహకారంగా స్వామి వారి సేవలో తరించేందుకు విరాళం అందించినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. స్వామి వారి నిత్యా న్నదాన పథకానికి ఇప్పటి వరకూ రూ. 83 లక్షలు అందించామని, స్వామి వారికి, భక్త్తులకు సేవలందించేందుకు తన సహకారంగా ఎల్లప్పుడూ ఉంటుందని డైరెక్టర్ ఎ. చైతన్యవాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్లు ఎం. మల్లేశ్వరరావు, కె. సత్యనారాయణ, ఎ.శేషు, రాజశేఖర్, ప్రభాకరరావు, మురళి, శ్రీనివాస్, అప్పారావు, తదితరులతోపాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు.