లాక్‌డౌన్ వేళ చిందులేసిన ప్రజలు.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2020-04-03T21:31:25+05:30 IST

ప్రపంచ దేశాలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 54వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యాలపై కూడా కొవిడ్ తీవ్ర ప్రభావా

లాక్‌డౌన్ వేళ చిందులేసిన ప్రజలు.. వీడియో వైరల్!

లండన్: ప్రపంచ దేశాలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 54వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యాలపై కూడా కొవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అమెరికా సహా.. బ్రిటన్‌లో కూడా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. బ్రిటన్ ప్రధాని, ఆరోగ్య మంత్రికి  కూడా కరోనా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు సామాజిక దూరం పాటించాలని ప్రజలకు సూచించింది. అయితే.. ఈ సామాజిక దూరం.. కానీ లాక్‌డౌన్ కానీ.. బ్రిటన్ ప్రజల సంతోషాన్ని ఏ మాత్రం దూరం చేయలేకపోయాయి. అదేలా అంటారా? లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోకుండా.. బయటికొచ్చి చిందులేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చేసిన సూచనలు పాటిస్తూనే.. ప్రజలు పార్టీ చేసుకున్నారు. ఇంటి గుమ్మంలోకి వచ్చి.. సామాజిక దూరం పాటిస్తూనే.. కాళ్లు, చేతులు కదుపుతూ డ్యాన్స్ చేశారు. ఆ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఆ వీడియోను దాదాపు మూడు మిలియన్ల మంది వీక్షించారు. బ్రిటన్ ప్రజల ఆలోచనకు ఫిదా అయిన కొందరు నెటిజన్లు వారిని ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2020-04-03T21:31:25+05:30 IST