ప్రాణాలతో ఇల్లు చేరుతానో లేదో.. వైరల్ అవుతున్న వినయ్ కుమార్ వీడియో..!

ABN , First Publish Date - 2020-02-19T21:42:33+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 75 వేల మంది కరోనా(కొవిడ్-19) వైరస్ బారినపడ్డారు. ఈ వైరస్ కారణంగా చైనాలో దాదాపు 2వేల మంది మరణించారు. ఇదిలా

ప్రాణాలతో ఇల్లు చేరుతానో లేదో.. వైరల్ అవుతున్న వినయ్ కుమార్ వీడియో..!

టోక్యో: ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 75 వేల మంది కరోనా(కొవిడ్-19) వైరస్ బారినపడ్డారు. ఈ వైరస్ కారణంగా చైనాలో దాదాపు 2వేల మంది మరణించారు. ఇదిలా ఉంటే జపాన్ తీరంలో నిలిపి వేసిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 542కు చేరింది. ఈ నౌకలో మొత్తం 3500 మంది ఉండగా.. అందులో 138 మంది భారతీయులు ఉన్నారు. 138 మందిలో ఆరుగురు కరోనా వైరస్ బారినపడ్డట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నౌకలో క్రూ సిబ్బందిగా పని చేస్తున్న ఇండియన్.. వినయ్ కుమార్ సర్కార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన మలాంగ్ సినిమాలోని ‘ఛల్ ఘర్ ఛాలెన్ మేరే హమ్‌దుమ్’ పాటను పాడాడు.


అంతకంటే ముందు.. తన కుటుంబాన్ని తలచుకుని బాధపడ్డాడు. ‘ సోషల్ మీడియాలో నా ముఖం చూడటం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఇక్కడ భయం భయంగా గడుపుతున్నాం. ప్రాణాలతో తిరిగి ఇంటికి చేరుకుంటామో లేదో కూడా తెలియదు. మేము సురక్షితంగా బయటపడుతామనే చిన్న ఆశ మాత్రం ఉంది. మా కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. నేను ఈ నౌకలో చాలా రోజులుగా పని చేస్తున్నాను. కానీ నా స్నేహితుడు మాత్రం మొదటిసారి వచ్చాడు. ఈ వీడియోను నా స్నేహితుడే తీస్తున్నాడు. విపత్కర పరిస్థితుల్లో నమ్మకం.. ఆనందం కలిగించేటువంటి వందలాది పాటలు పాడినందుకు సింగర్ అరిజిత్ సింగ్ హ‌ృదయపూర్వక ధన్యావాదాలు’ అంటూ వ్యాఖ్యానించాడు. 


Updated Date - 2020-02-19T21:42:33+05:30 IST