జంగారెడ్డిగూడెంలో వైసీపీ కార్యకర్తల దౌర్జన్యం
ABN , First Publish Date - 2022-03-17T23:42:51+05:30 IST
జంగారెడ్డిగూడెంలో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. తమ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వైసీపీ కార్యకర్తలపై..
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. తమ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వైసీపీ కార్యకర్తలపై.. టీడీపీ కార్యకర్త వెంకటేశ్వరరావు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపైనే కేసు పెడతావా అంటూ వెంకటేశ్వరరావుపై వైసీపీ కార్యకర్తల దాడికి దిగారు. అంతటితో ఆగకుండా సెల్ఫోన్, రూ.10 వేల నగదును వైసీపీ కార్యకర్తలు వీరబాబు, శ్రీను, రమేష్, సీతారాముడు లాక్కెళ్లారు. వైసీపీ కార్యకర్తలతో దాడిలో గాయపడ్డ వెంకటేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.